28, ఏప్రిల్ 2011, గురువారం

సత్యం సమాధి.....చేస్తారా???

మనిషిని సమాధి చేస్తారు...మంచినీ సమాధి చేస్తున్నారు....ఇప్పుడు సత్యాన్ని కూడ సమాధి చేసారు. ఎప్పటికీ ఎవ్వరు తెలుసుకోలేని ఒక గొప్ప సత్యాన్నిసమాధి చేశారు. ప్రపంచంలో ప్రతి జబ్బుకి మందు ఉంది ఒక్క డబ్బు అనే జబ్బుకి తప్ప!! అందుకే సాయి మరణించారు... ప్రేమతత్వం, సత్యం, శాంతి, శివమయం అనే నీతిభోధలు చేసే బాబా తన చుట్టూ పెరుగుతున్న డబ్బుజబ్బు, అధికారదాహం, వారసత్వం, కుళ్ళు, కుతంత్రాల గురించి తెలుసుకో లేక పోయారా?????
అవును అనాలో...కాదు అనాలో...లేక తెలిసినా ఏమి చేయలేక పోయారు అనుకోవాలో...అర్ధం కాని అయోమయస్థితిలో అయన భక్త కోటి ఉన్నారు.....
అసలు ఏంటి ఆ...సత్యం? ఎవరు సమాధి చేసారు? ఎవరి ప్రేమేయం ఎంత? మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, దేశాధినేతలు ఇంత మంది వచ్చారు....చూసారు....వెళ్లారు.
నిజ నిర్ధారణ చేయాల్సిన పని మాది కాదు అన్నట్లు ఉంది వారి పని తీరు..
మీడియా ప్రశ్నిస్తున్నా ఎవరు వినపడనట్లు ఉంటున్నారు, అన్ని సందేహాలు ప్రజలకే కానీ....ప్రభుత్వానికి కాదు అన్నట్లు ఉంది చూస్తుంటే.
మన రాష్ట్ర నాయకులకి ఉపఎన్నికల మీద ఉన్న శ్రద్ధ కోట్ల మంది భక్తుల దైవం ఐన సాయి మరణం పై ఉన్న సందేహాల మీద లేకుండా పోయిందా?
ఏమి జరిగింది అసలు?
ఎవరు చేశారు?
ఎలా చేశారు?
ఎందుకు చేశారు?
ఇవి సగటు ప్రజానీకానికి వస్తున్న ధర్మ నిలయంలో. ప్రశాంతి నిలయంలో ప్రశాంతి నిలయంలో సమాది చేసారు, అంతే ఇవి ఇంక ఎప్పటికీ సమాధానం లేని, దొరకని సందేహలేనా....?? అంటే అవును అనే చెప్పాలి.
దైవం అని చెప్పుకునే ఆశ్రమ పెద్దలే ఇలా శ్రీకాంత్ సాయంతో అసలు ఈ దైవత్వానికి ఉన్న శక్తి ఎంత? అసలు బాబా దేవుడే నా?? అయితే తనని తను కాపాడుకోలేక పోయరా? అసలు ఆ ఆశ్రమం లో ఉన్నది దైవత్వమ లేక ధనతత్వమా?
ఇవి మనసులో ఉన్నా...మాట ద్వారా బయటకి రాలేకపోతున్న ప్రశ్నలు.
ఒక మనిషి అదుపు చేయలేనంత సంపద ఆ మనిషి(దేవుడిని ఐన) నీ మరణశయ్య మీదకి తీసుకువెళుతుంది అని నిరూపించిన యుగం మన కలియుగం.

తరతరాలుగా
జరుగుతున్న సహజ ప్రక్రియే అయినా విన్న ప్రతిసారి ఏదో తెలియని కలత,కలవరం. ఒక మనిషికి అనుభవించలేనంత పేరుప్రతిష్టలు, ఆస్థిఅంతస్థులు వస్తే ఆఖరికి ఏమౌతుందో?? అందుకు నిదర్శనమే సత్యన్నారాయణరాజు అలియాస్ సత్యసాయిబాబా జీవితం. మహిమలు, ఆధ్యాత్మికత, సామాజిక సేవ, విద్యాలయాలు....ఇలా పలురకాలుగా జనంలోకి చొచ్చుకుని పోయిన సత్యసాయి తన ఉపన్యాసాలతో దేశీయులనే కాక విదేశీయులను సైతం తన వాక్చాతుర్యంతో తన భక్తులుగా చేసుకున్నారు, ఎనలేని సంపదలను గడించారు. ఆఖరికి అవసాన దశలో తన చుట్టూ ఉన్న వారి చేతిలో కీలుబొమ్మగా మారారు. బతికి ఉండగానే శవపేఠికను సిద్ధం చేసి సాయిని గురించి, ఆయన ఆరోగ్యాన్ని గురించి పలురకాల అనుమానాలకు తావిచ్చిన ట్రస్టు సభ్యులు, కుటుంబసభ్యులు, అధికార ప్రముఖులు ఎందుకు పారదర్శకంగా లేరు అన్నదానికి సమాధానం లేదు ఇప్పటికీ...!!
దైవ సమానుడని, దివ్య మహిమలు వున్నవాడని నమ్మిన ఎంతోమంది భక్తులకు చివరి దశలో ఏమి జరిగింది?? అన్నది ప్రశ్నార్ధకంగానే మిగిలిపోయింది. ఆస్థులకోసమే ఆనాడు చిన్నారి వైష్ణవి కాలి బూడిద అయింది. ఈనాడు దైవస్వరూపుడు కీలుబొమ్మైనాడు. సత్యసాయి సత్యం సమాధైంది....మరొక్కసారి చరిత్ర పునరావృతమైంది.....ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్న మహాకవి శ్రీశ్రీ మాటల్లో నిజమెంతో ఈపాటికి మనకి అర్ధమైవుండాలి....
ప్రశాంతి నిలయంలో అశాంతి పాలైన మహా మనీషి ఆత్మకి మనశ్శాంతి సిద్దించాలని దైవాత్మ శివైఖ్యం కావాలని కోరుకుంటూ.....
(శ్రీకాంత్ సాయంతో.....)
అన్నట్టు చెప్పడం మరిచానండోయ్ ఇది నా రెండువందల టపా!! రాతలను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న అందరికి కృతజ్ఞతాపూర్వక వందనాలు......
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner