12, ఏప్రిల్ 2011, మంగళవారం

నిజానిజాలు ఏంటో మరి....??

పరిటాల రవి చని పోయిన ఇన్ని రోజులకు నువ్వు చంపావు అంటే నువ్వు చంపావు అని ముఖాముఖి లో కొట్టుకుంటున్నారు అందరూ....పరిటాల రవిని ఎవరు చంపారు అన్నది జగమెరిగిన సత్యం. సరే అది పక్కన పెడితే జగన్ అని కాంగ్రెస్ వర్గాలు ముక్త కంఠంతో హోరెత్తుతున్నాయి ఈ రోజు...మరి చంపిన రోజు ఎందుకు చెప్పలేదు ఈ నాయకులు అందరూ...ఆ రోజు వాళ్ళు వాళ్ళు చుట్టాలు...మరి ఇప్పుడు వేరు కుంపట్లు కనుక ఇంతకు బేరం కుదుర్చుకుని ఇలా ప్లాన్ వేసి చంపించాడు జగన్ అని చెప్తున్నారు. మరి ఈ నిజాయితీ ఆ రోజేమయ్యిందో!! మన నాయకుల నిజాయితీ ఎంతో మనకు బాగా తెలుసు. ఎన్నో సంఘటనలు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.....ఒక ఆయేషా, ఒక శ్రీలక్ష్మి, చిన్నారి వైష్టవి, ఓ సత్యంబాబు......ఇలా ఎందరో నాయకుల అధికారానికి, ఇనుప కాళ్ళకు బలి అవుతున్నారు.
మొద్దుశీనుని చంపి ముందు టి వి లో అది ఆత్మహత్య అన్నారు అది హత్య అని చిన్న పిల్లాడికి కుడా తెలుస్తుంటే ఇక వేరే దారి లేక హత్య అని ఒప్పుకున్నారు. సూరిని వై ఎస్ ఆర్ ఉన్నప్పుడే వదిలేయాలని చూసారు, కాని విమర్శలకు తట్టుకోలేక సూరి విడుదలను వాయిదా వేసారు. మొత్తానికి సత్ప్రవర్తన అన్న పేరుతొ వదిలేసారు కాకపొతే చావుని ఆపలేకపోయారు. లేకపోతె ఈ సరికి ఇంకో రాజకీయ నాయకుడు జగన్ కి తోడు ఉండేవాడు.
జనానికి ఈ రాజకీయాలు అర్ధమై ఎవడిని నమ్మాలో ఎవడిని నమ్మకకూడదో ఇప్పుడు బాగా తెలుసు. ఈ పనికిమాలిన చర్చలు మానేసి టి వి మీడియా వాళ్ళు జనానికి పనికివచ్చే చర్చలు పెట్టి కొన్ని సమస్యలకయినా పరిష్కారం చూపిస్తే బావుంటుంది. వాడంత తిన్నాడు...వీడింత తిన్నాడు...వాడు వాడిని చంపాడు...ఇలాంటి చెత్త చర్చలు మాని మీడియా గౌరవం పెంచే చర్చలు చేస్తే ఎంతో మేలు.

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Unknown చెప్పారు...

కాని మనమేమి చెయ్యగలము .. ఇప్పుడు అన్యాయం అక్రమం రాజ్యం ఏలుతోంది .. మంచి తనం మూగబోయింది ..
మంచి చెయ్యాలన్న మనకి చెడె జరుగుతుంది ..

చెప్పాలంటే...... చెప్పారు...

నిజమే కావ్య గారు చూస్తూ వుండటం తప్ప ఏమి చెయ్యలేక పోతున్నాము....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner