29, జూన్ 2013, శనివారం

అక్రమ తవ్వకం...చూస్తూ ఊరుకున్న అధికారులు....!!

మన చేలో మన్ను మనం తవ్వుకోడానికి లక్షా తొంభై పర్మిషన్లు వాటికోసం వేల వేలు లంచాలు...మన మట్టి మనం
తవ్వుకోడానికి...అదేమని అడిగితే ఆ కేసు ఈ కేసు అని డబ్బులు దండుకోడానికి చూస్తారు. మరి ప్రభుత్వ భూములు చెరువులుగా రాత్రి పగలు తేడా లేకుండా చెరువులుగా తవ్వుతుంటే చూస్తూ ఊరుకోలేక ఫిర్యాదు చేస్తే ఏంటి మీకంత ఇంట్రెస్ట్ అని అడుగుతున్నారు....!! కలక్టర్ గారికి కి చెప్దామని ఫోన్ చేస్తే వారి వరకు ఫోను
వెళ్ళదాయే. మధ్యలోనే అడ్డుకట్టలు....!!
1041 సర్వే నెంబరు ప్రభుత్వ భూమి కోడూరు మండలం పోటుమీద గ్రామం లో నలభై ఎకరాల అసైన్డ్ భూమిని చెరువులుగా ఒక వారం రోజుల నుండి నాలుగైదు ప్రొక్లైనర్లు పెట్టి తవ్వుతుంటే ఎవరు పట్టించుకోవడం లేదు. కంప్లైంట్ చేద్దామని చూస్తే ఇది పరిస్థితి. ఎవరికీ చెప్పాలో మాకే తెలియకుండా పోతుంటే ఏమి తెలియని వారి సంగతి ఇక ఏంటి...??  రేపటితో ఆ తవ్వకాలు పూర్తీ అయిపోవచ్చు కూడా...!! ఆర్ డి ఓ, ఎమ్ ఆర్ ఓ, వి ఆర్ ఓ....ఇలా అందరు ఎవరికీ వారు లక్షలు లక్షలు తిని చూస్తూ ఊరుకుంటుంటే పై అధికారులైన గౌరవనీయులు కలక్టర్ గారు ఏం చేయకుండా ఉంటే సరిపోతుందా....!! పంట పొలాల మధ్యలో రొయ్యలు చేపల చెరువులకు పర్మిషన్లు జి ఓ ప్రకారం ఇచ్చాము అంటే సరిపోతుందేమో....!!
తవ్వుతున్న చెరువు రూట్ :
కోడూరు మండలం పోటుమీద గ్రామం.... నాగాయలంక నుండి బావదేవరపల్లి ఊరిలొ నుండి లోపలికి భావన్నారాయణ స్వామీ గుడి దాటిన తరువాత ఎడమ వైపు సిమ్మెంట్ రోడ్డులో వెళ్తే రెండు రెండున్నర కిలోమీటర్ల దూరంలో 1041 సర్వే నెంబరు ప్రభుత్వ భూమి చెరువులుగా తవ్వబడుతున్నది... !!
ఇది అక్రమ తవ్వకం ఎమ్ ఆర్ ఓ అధ్వర్యంలో జరుగుతున్నది...ఆ పై అధికారులు అందరు ఈనాములు తీసుకున్న వారే....!! చూస్తూ ఊరుకున్న అధికారులు
తదుపరి ఏం చేయాలో.....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner