7, జనవరి 2015, బుధవారం

ఒక చిన్న మాట ...!!

ఏ సమూహంలో అయినా కవితా పోటీలు పెట్టినప్పుడు న్యాయ నిర్ణయం అనేది ఏక పక్షంగానో లేదా వ్యక్తుల పేర్లు చూసి కాని, గొప్ప కవులని కాని చూడరు... న్యాయ నిర్ణేతలు ఎవరైనా కవితలను ఒకటికి నాలుగైదు సార్లు చదువుకునే ఎంపిక చేస్తారు... సమయ లేదని కాని.. పెద్ద కవితలను చదవకుండా వదిలేయడం కాని జరగదు... ఒకరు భావానికి ప్రాధాన్యతనిస్తే మరొకరు భాషకు, ఇంకొకరు భావంతో పాటుగా పదాల ఎంపికకు మరొకరు కవితలోని కొత్తదనానికి ఇలా నిర్ణయాలు తీసుకుంటారు...ఇక్కడ న్యాయ నిర్ణేతగా ఉండటానికి అర్హత నిర్ణయించేది సముహ నిర్వాహకులు... ఈ అర్హత ఎవరికీ వారు ఆపాదించుకుంటే వచ్చేది కాదు. 

న్యాయ నిర్ణయాన్ని చెప్పేంత గొప్పదాన్ని కాకపోవచ్చు కాని నేను న్యాయ నిర్ణేతగా ఉన్న సమయంలో నా మనసుకు నచ్చిన వాటినే ఎంపిక చేసాను... నాకు నచ్చినవి మరొకరికి నచ్చాలని నిబంధన ఏమి లేదు.... నాకు నచ్చిన కవిత ఎందుకు నచ్చిందో  నేను చెప్పగలిగితే నా న్యాయ నిర్ణయం సరి అయినదే అవుతుంది... మీకు అందరికి తెలియాలని చెప్తున్నా ఈ రోజు ఈ విషయాలు ...

సాహితీ సేవలో ఒకసారి నేను న్యాయ నిర్ణేతగా ఉన్నాను... మరోసారి ప్రాధంక న్యాయ నిర్ణేతగా కూడా ఉన్నాను ... ఏదైనా నా దృష్టిలో ఒకటే... కవితను చదువుతాము కాని కవిత రాసినవాళ్ళు ఎంత గొప్పవారైనా అక్కడ అప్రస్తుతం... నచ్చిన అంశాలు పరిగణలోనికి తీసుకుని ఫలితాలు పంపేస్తాము..తరువాత మరో ఇద్దరు న్యాయ నిర్ణేతలు వారి వారి ఫలితాలు ఇచ్చి .. ఆ తరువాత అందరు చర్చించి ఏకాభిప్రాయానికి వస్తారు.... ఇవి అన్ని జరగడానికి ఎంత సమయం పడుతుంది అని విజ్ఞులైన మీకు చెప్పనవసరం లేదు... ఇక్కడ న్యాయ నిర్ణేతలకు కాని సముహ నిర్వాహకులకు కాని ఒరిగేదేమీ ఉండదు... మన అమ్మ భాష మీద పెంచుకున్న మమకారం తప్ప... పోటికి రాసే ప్రతి ఒక్కరు తమ కవిత ప్రధమ స్థానంలోనే ఉండాలని కోరుకుంటారు... నేనైనా అంతే... మన కవిత న్యాయ నిర్ణేతలను మొదటిసారి చదవగానే మెప్పించేదిగా ఉండాలి.... కవితలు రాయడంలో దిట్టలైన అనుభవజ్ఞులకు తెలియని విషయం కాదు ఇది... ఇక భాషాలోపాలు అంటారా ఒక్కోసారి చిన్నవే అని వదిలేస్తారు... తప్పులు లేకుండా రాసినంత మాత్రాన గొప్ప కవిత అవదు కదండీ...

సాహితీ సేవలో ఫలితాలు ప్రకటించిన రోజునే న్యాయ నిర్ణేతలతో ముఖా ముఖి రెండు గంటల పాటు ఏర్పాటు చేశారు... న్యాయ నిర్ణయంలో పాలుపంచుకున్న ఐదుగురు న్యాయ నిర్ణేతలు చర్చలో పాల్గొన్నారు... నాకు తెలిసి ఏ కవితా పోటిలకు ఇలా ఫలితాల తరువాత చర్చ జరగలేదు... సభ్యులకు సందేహ నివృత్తి చేయడానికి మరో రెండు రోజుల తరువాత కూడా ముగిసిన చర్చను మళ్ళి కొనసాగించారు...ఆ చర్చ చూసిన వారికి న్యాయ నిర్ణయం ఎలా జరిగిందో తెలుస్తుంది..

మనకు ఒక్కరికి నచ్చినంత మాత్రాన మనం రాసిన కవిత గొప్పదైపోదు... పది మందితో చదివించుకున్న కవిత ఎప్పటికి గొప్పదే నా దృష్టిలో... తప్పులు దొర్లడం మానవ సహజం అండి... మనం నేర్చుకోవాల్సింది..ఒకరి తప్పులు ఎంచే ముందు మనం తప్పులు లేకుండా... అర్ధవంతంగా  రాయగలగడం ... తెలియని వారు భాష మీద పట్టు లేని వారు రాస్తే అర్ధం ఉంది... సాహిత్యంలో, పురాణాలలో పండిపోయి కూడా తప్పులు రాస్తూ, అర్ధం లేకుండా కవితలు రాస్తుంటే వారిని ఎలా అర్ధం చేసుకోవాలి... ఎవరమైనా ఒకటి గుర్తు పెట్టుకోవాలి... మనం ఒక వేలు ఎదుటి వారికి చూపిస్తే మన నాలుగు వేళ్ళు మన వంకే చూపుతాయి...


సాహిత్యంలో ఇప్పుడిప్పుడే నడకలు నేర్చుకుంటున్న మాలాంటి వాళ్లకు చక్కని మీ సద్విమర్శలతో స్వాగతం పలకండి .. మీ అనుభవ పాఠాలు మాకు పంచండి.. తప్పులను సరిదిద్దండి... అక్షరాలకు అండగా నిలవండి... నడవలేక పడిపోతుంటే ఆసరా ఇవ్వండి.. మా తప్పులను మన్నించి పెద్ద మనసుతో మీ దీవెనలు మాకు అందించండి... 
నా ఈ పోస్ట్ తో ఎవరినైనా నొప్పిస్తే పెద్ద మనసుతో మన్నించండి...

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner