7, మార్చి 2015, శనివారం

మహోన్నత తెలుగు తేజం....!!

ఈనాటి యువతలో పేరుకు పోతున్న అసహనానికి కారణాలు అనేకం... కాని మీ సమస్యను నాకివ్వండి దానికి
పరిష్కారం నేను చూస్తాను అన్న ఈ అపర మేధావి గురించి మనలో ఎంత మంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు... పుట్టింది పెరిగింది సామాన్య కుటుంబంలో .... చదువులో ఉన్నత శిఖరాలను అధిరోహించి తనదైన ఆలోచనలతో ముందుకు సాగుతూ కొన్ని రోజులు మన దేశంలో తన సేవలను అందించి .... తన ప్రతిభకు తగిన అవకాశాలను కల్పించలేని మాతృదేశాన్ని వదలలేక వదలి అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఒమన్ దేశంలో తన ప్రస్థానాన్ని పెట్రోలియం ప్రాజెక్టులో ఇంజనీరుగా మొదలు పెట్టి ఒమన్ సోహార్ ఇన్ ప్రాస్ట్రక్చర్ కంపెనీలో రోడ్స్ ఇంజనీరుగా పనిచేస్తూ కూడా భారత దేశం పై ఉన్న మమకారంతో తన దేశం సూపర్ పవర్ గా రూపాంతరం చెందాలంటే ఏం చేయాలి అన్న అంశంపై దాదాపు ఐదు ఏళ్ళు కష్టపడి వేల జర్నల్స్ రూపొందించి సమాజం అభివృద్ధి చెందటానికి చాలా కీలకమైన రంగం మౌలిక సదుపాయాలు అందించడం అని బలమైన వాదన వినిపిస్తున్నారు...
'ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ ఎ లాట్' అనే సూత్రంపై ఏకంగా ప్రత్యేక టెక్నాలజీని రూపొందించి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందచేశారు. చంద్రబాబు ఆనాడు చాలా ఘనంగా ప్రచారం సాగించుకున్న విజన్ 2020 ప్రోగ్రాంలో గుప్త ప్రతిపాదించిన సిద్ధాంతాలను యధాతథంగా వినియోగించుకున్నారు.ఇవే కాకుండా కర్నాటక ముఖ్యమంత్రిగా ఎస్ ఎం కృష్ణ ఉన్నప్పుడు ఆయన స్వయంగా గుప్తను ఆహ్వానించి రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి సలహాలు, సూచనలు తీసుకున్నారు.ఈ గుర్తింపులతో సరి పెట్టుకొనక  దేశ ఆర్ధిక పురోభివృద్ధికి ఐటి రంగం చాలా చేయూతనిస్తుందని చెబుతూనే దానికంటే ఎక్కవ ప్రాధాన్యం ఇవ్వాల్సిన రంగం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అని ఖచ్చితంగా తన వాదన వినిపిస్తూ దానికి తగిన గుర్తింపు ప్రభుత్వం ఇవ్వడం లేదని తన ఆవేదనను చాలా వేదికలపై వ్యక్త పరుస్తూ.... గడచిన అరవై ఏళ్ళ కాలమంతా అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఈ రంగం నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేస్తూ... అభివృద్దికి బాటలు వేసే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి రహదారుల వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే దేశ ఆర్ధిక పురోగతికి స్థిరమైన ప్రగతికి బాటలు వేస్తుందని... దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంథానం చేస్తూ విశాలమైన రహదారులు, అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాల నిర్మాణం, నౌకాశ్రయాలు, నీటి ప్రాజెక్టులు, నీటి పారుదల వ్యవస్థ, రైలు మార్గాలు ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పనే దేశ భవితకు తిరుగులేని రాచమార్గాలని సోదాహరణంగా వివరిస్తున్నారు...ఇన్ ఫ్రాస్ట్రక్చర్ గురించి అభివృద్ధి చెందిన 160 దేశాల్లోని స్థితిగతులను అధ్యయనంచేసిన అనుభవాన్ని మేళవిస్తూ... భారతదేశ సహజ ఒనరులను, మానవ ఒనరులను, చక్కని ప్రతిభ ఉన్న యువతను కాస్త సానపట్టి, రాజకీయ, విద్యా రంగాలలో మార్పులు చేస్తూ సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ.... ఏ దేశ మేగినా ఎందు కాలిడినా నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్న ఆర్యోక్తిని అక్షరాలా పాటిస్తూ తెలుగు వారికి తనదైన చేయూతను అందిస్తూ... తన మాటల చాతుర్యంతో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిస్తూ... లెక్కలేనన్ని సత్కారాలను, దేశ విదేశాల్లో అత్యన్నత గౌరవ పురస్కారాలను అందుకున్నా.... తెలుగు'వాడి' వేడిని ప్రపంచానికి చూపించిన ఈ భీమవరం మద్దుల నాగభూషణ రావు గుప్త తన మాతృ భూమికి తన సేవలు వినియోగించాలన్న తపనను వీడలేక... సరైన అవకాశం కోసం నిరీక్షిస్తున్న ఈ అపర మేధావి మేధను అభినందిస్తూ... 
భారత దేశం సూపర్ పవర్ గా నిలవాలన్న తన కోరికలో మనమూ భాగస్వాములం అవుదామని... 
ప్రభుత్వం సత్వర సహకారాన్ని అందిస్తూ గుప్త గారి సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటూ.... 
ఇంతటి మహోన్నత తెలుగు తేజం మనదైనందుకు తెలుగు వారిగా మనమూ గర్వపడదాము....

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner