22, మార్చి 2015, ఆదివారం

రచ్చ గెలిచి ఇంట గెలవాలనుకుంటున్న....!!

ఎక్కడో భీమవరం... సాధారణ మధ్య తరగతి జీవితం... సరస్వతీ దేవి కటాక్ష వీక్షణాలతో కరుణించి వరాలుగా 
అందించిన చదువుతో ఉన్నత చదువులను అందుకుని విదేశాలను సైతం తన ప్రతిభతో మెప్పించిన అపర మేధావి ఎం ఎన్ ఆర్ గుప్తా గారు తెలియని తెలుగు వారు ఈ రోజు లేరు అంటే అతిశయోక్తి కాదు.
ఎక్కడో పరాయి దేశంలో ఉన్నా మాతృ దేశంపై మమకారం విడువక తన సేవలు తన సొంత గడ్డకు ఉపయోగపడాలి అన్న తపనను వదలలేక తన చదువు, తెలివితేటలు, తను అపార అనుభవం గడించిన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మెళకువలు అన్ని తన వారి కోసమే అంటూ చంద్రబాబు గారి పిలుపుకు స్పందించి తన వంతుగా సేవలను అందించడానికి స్వచ్చందంగా ముందుకు వచ్చిన గుప్తా గారు అభినందనీయులు...
ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలో తనదంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ మౌలిక సదుపాయాలకు, సహజ ఒనరులకు పెద్ద పీట వేస్తూ రాష్టాభివృద్దికి కావాల్సిన మొత్తంలో తమ వంతుగా చేయినందిస్తామంటూ బాబుగారికి మాట ఇచ్చి రాజధాని నిర్మాణంలో కీలకపాత్రను వహిస్తామని చెప్పి.. పెట్టుబడుల సేకరణలో సహకారాన్ని, నిర్వహణా బాధ్యతలను స్వచ్చందంగా స్వీకరిస్తామని మనస్పూర్తిగా చెప్పిన ఈ తెలుగు వెలుగుతో మన రాష్టం వెలుగులు చిమ్ముతుందని... గత పది ఏళ్ళుగా ఓ నలభై సంవత్సరాలు వెనుకకి వెళ్ళిన మన రాష్ట్రం ఈ అపర మేధావుల ఆశయ సాధనతో ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలవాలని... ప్రపంచ దేశాలకు ఆదర్శం కావాలని కోరుకుంటూ... తెలుగు'వాడి' సేవలు ప్రపంచానికి కావాలి కాని తెలుగు రాష్ట్రానికి వద్దా..? అన్న ప్రశ్నను తలెత్తనీయక ఇంట గెలిచి రచ్చ గెలవమన్న సామెతను తిరగరాసిన ఈ తెలుగు తేజాన్ని మనం సాదరంగా స్వాగతిస్తూ కనీసం రచ్చ గెలిచి ఇంట గెలవాలనుకుంటున్న తన సంకల్పానికి మన మద్దత్తునిస్తూ తెలుగు వారిగా గర్వపడదాం....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner