4, ఆగస్టు 2015, మంగళవారం

నవ్యాంధ్ర రాజధాని అమరావతి రూపురేఖల నమూనా....!!

అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోబోతున్న నూతన రాజధాని నిర్మాణానికి ప్రాజెక్ట్ ను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ ( పి పి పి ) సహకారంతో తయారు చేశామని భీమవరం వాస్తవ్యులు, ఒమన్ లో ప్రముఖ ప్రాజెక్ట్ నిర్వహణా నిపుణులు శ్రీ ఎం ఎన్ ఆర్ గుప్త గారు భీమవరంలో సిటిజన్స్ ఫోరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చెప్పారు. ఒమాన్ దేశ ఎన్ ఆర్ ఐ అయిన తను 50 మంది అంతర్జాతీయ నిపుణులతో ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయేలా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ ప్రాజెక్ట్ ను తయారు చేసి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారికి అందజేశామని, ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం సుమారుగా 3 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని చెప్పారు. ప్రస్తుతం ఒమన్ నుంచి సౌది అరేబియాకు జరుగుతుతన్న హైవే నిర్మాణానికి ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్నానని చెప్పారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మ్యాప్ మాత్రమే అందజేశారని తాము మాత్రం ఏ ఏ ప్రాంతాల్లో బిల్డింగులు నిర్మించాలి అనే వాటిపై ప్రాజెక్ట్ ల ద్వారా ప్లాన్ తయారు చేసి సి ఎమ్ కు ఇచ్చామని తెలిపారు. భీమవరానికి చెందిన తను 12 ఏళ్లలో అతి ప్రతిష్టాత్మకమైన 20 అవార్డులు సాధించానని ముఖ్యంగా రైల్వే కాన్ఫరెన్స్ అవార్డు 2014 ను అందుకున్నానని చెప్పారు. రాజధాని ప్రాజెక్ట్ ల నిర్మాణానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner