2, సెప్టెంబర్ 2015, బుధవారం

ఆంధ్ర రాష్ట్రానికి ఆపన్న హస్తం...!!

విభజనల కష్టాల్లో, నిధుల లేమితో అల్లాడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఆపన్న హస్తాన్ని అందిస్తున్న మిషన్ అమరావతిలో భాగంగా... శ్రీ పల్లె రఘునాధ్ రెడ్డిని, శ్రీ పరకాల ప్రభాకర్ గారిని కలిసిన ఎమ్ ఎన్ ఆర్ గుప్త గారు
ముఖ్య మంత్రి ఎన్ ఆర్ ఐ లకు ఇచ్చిన పిలుపుకు స్పందించి  2002 లో విజన్  2020 ఫర్ డెవెలప్మెంట్ ఆఫ్ ట్రాన్స్ పోర్టేషన్ సెక్టార్లో సూచనలు అందించి రవాణ శాఖ, మౌలిక సదుపాయాలు, సహజ వనరుల ఉపయోగంతో పలు అభివృద్ధికి బాటలు వేసిన అప్పటి సూచనలకు...అనుసంధానంగా ఇప్పటి అమరావతి రాజధాని నిర్మాణానికి చేయూత, ఆర్ధిక వనరులను అందించడానికి ప్రత్యేక ప్రతిపాదనతో ముందుకు వచ్చి గుప్త గారు మరిన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు, అభివృద్దికి విదేశాల నుంచి చాలా శ్రమలకు ఓర్చి పలుమార్లురాష్ట్ర నాయకులను, ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు గారిని కలవడానికి రావడం చాలా సంతోషకరమైన విషయం.... అద్భుతమైన ప్రాజెక్ట్ మానేజ్మెంట్ నైపుణ్యంతో విదేశాల్లో పలు అవార్డులు అందుకున్న మన తెలుగు వారైన గుప్త గారి సేవలు వినియోగించుకుని ఆంధ్ర రాజధాని నిర్మాణమే కాకుండా ... రహదారుల నిర్మాణంలోను, సహజ వనరులను ఉపయోగించడంతో ఆర్ధిక ఒనరులు పెంచుకోవడానికి , రాష్ట్రాన్ని సాంకేతిక పరంగా ముందుకు తీసుకు  వెళ్ళడానికి వినియోగించుకోవడానికి మన నాయకులు సంసిద్దత తెలియపరచాలని కోరుకుందాం...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner