26, సెప్టెంబర్ 2015, శనివారం

నాదేం లేదు దీనిలో అధ్యక్షా...!!

    ఎవరో రావాలి.. ఏదో చేయాలి  అని ఎదురు చూస్తూ మన తప్పులకు ఎన్నో అన్నెం పున్నెం ఎరుగని అభాగ్య జీవులను బలి చేస్తూ దానికి రాజకీయ రంగులను పులుముతూ ఎవరో అన్నట్టు శవాలతో రాజకీయాలు చేసే స్థాయికి ఈరోజు మనం దిగజారి పోతున్నాం.. మనం అనుకుంటాం ఆఁ ఏం పోయింది మనం వేసేది ఒక్క కాగితమే కదా ఏం అవుతుందిలే అని.. కాని అలా పేరుకు పోయిన చెత్తే ప్రాణాలతో చెలగాటమాడుతుంది..
   సమస్య మనదైనప్పుడు పరిష్కారం మనమే చూసుకోవాలి... ఎప్పుడో ఆ కాలంలో యద్దనపూడి గారు చెప్పినట్టు ఈ దేశం మాకేమిచ్చింది అని కాకుండా మనం దేశానికి ఏమి ఇవ్వలేక పోయినా పర్లేదు మనమైన సమాజానికి మన వంతుగా ఏం చేస్తున్నాం అని ఓ క్షణం ఆలోచిస్తే... అసలు సమాజం వరకు ఎందుకండీ మన ఇంట్లో వరకు మనం చూసుకుంటే చాలదూ... ఏదో కాస్త సమాజాన్ని అప్పుడు చూడొచ్చు... చిన్న చిన్న సమస్యలను మనమే పెద్దవిగా చేసేస్తూ దానికి వేరేవరినో బాధ్యులను చేసి న్యాయం కావాలి అంటే ఏ దేవుడు న్యాయం చేస్తాడు.. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎవరికి వారు కనీసం కొన్ని నియమాలు ఆ దేశ పౌరులుగా ఉన్నందుకు పాటిస్తారు... మనం ఓటు వేయడానికి డబ్బు తీసుకుంటుంటే వాళ్ళు అదే ఓటు వేయడానికి డబ్బు కడతారు చూసారా చిన్న తేడా వాళ్లకి మనకి మధ్య...
    ఈ ప్రత్యేక హోదాలు, ధర్నాలు వీటి వల్ల మనకు కొత్తగా ఒరిగేదేం లేదు... వాటికి ఖర్చు పెట్టే డబ్బుతో కాస్త సమాజానికి ఉపయోగ పడే పనులు చేస్తే జనాలు పది కాలాలు గుర్తుంచుకుంటారు...మాట మాట్లాడితే సింగపూర్, జర్మనీలు తిరగకుండా ఆ డబ్బు కొద్దిగా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగిస్తే మరోసారి గెలవడానికి పనికివస్తుంది...
ఇదండీ నేడు మన పరిస్థితి.. అందుకే నేను చెప్పొచ్చేదేటంటే " ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా... నిజం మరచి నిదురపోకుమా" అని మన పెద్దోళ్ళు చెప్పిన మాటే ఓ పాలి గుర్తుచేసాను అంతే... నాదేం లేదు దీనిలో అధ్యక్షా...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner