21, మార్చి 2017, మంగళవారం

మారని నేతల తీరు...!!

నేస్తం,
        మనం ఎన్ని చెప్పినా, ఏమి చేసినా మనం ఎన్నుకున్న ప్రజా నాయకుల తీరు మారబోదని మరోమారు ఋజువు అవుతోంది. అధికార పక్షమా, ప్రతి పక్షమా అని లేకుండా ప్రజల తీర్పుతో గెలిచామని మర్చిపోయి వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న నేటి రాజకీయ ప్రముఖులు మనకి అవసరమా... ఒకప్పుడు ప్రచార మాధ్యమాలు లేవు. ఇప్పుడు ప్రపంచం యావత్తు చూస్తుందన్న ఇంగిత జ్ఞానంలేని ఈ నాయకులనా మనం ఎన్నుకున్నది అని ప్రతి ఒక్క ఓటరు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసెంబ్లీ / పార్లమెంట్  అంటే ప్రజల సమస్యలను, అవసరాలను తీర్చాల్సిన బాధ్యత కలిగిన ప్రజానాయకులు ఉండాల్సిన చోటు. నోటుకు ఓటు అమ్ముడు పోయినంత కాలం ఇలానే ఉంటుంది. ప్రజల పక్షాన మాట్లాడే నాయకులు మాత్రమే అసెంబ్లీ / పార్లమెంట్లో అడుగుపెట్టే రోజు ఎప్పుడు వస్తుందో...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner