31, మే 2010, సోమవారం

అశ్రునివాళి....

వేటూరి ఇక లేరు అన్న నిజం ఒప్పుకోడానికి మనసు రావడం లేదు. నిన్న మొన్నటి వరకు తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి.
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్నా....ఉప్పొంగెలే గోదావరి...అని గోదారి అందాలను అచ్చ తెనుగులో మనకు వినిపించిన మహాకవి. తెలుగు జాతి సగర్వంగా తల ఎత్తుకోగలిగిన రోజు... జాతీయ అవార్డుని తెలుగుకి ప్రాచీన హోదా కల్పించలేదని తృణప్రాయంగా త్యజించిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది.
వేణువై భువనానికి వచ్చి తేట తెలుగు తియదనాన్ని మనకు రుచి చూపించి మలయమారుతపు చల్లదనపు స్పర్శ ని మనకందించి గాలిలానే గగనానికి ఎగిరి పోయిన వేటూరి సుందరరామమూర్తి గారి దివ్య స్మృతికి అశ్రునివాళి....
పుట్టిన ప్రతివారు మరణించక తప్పదని తెలిసినా ఎందుకో రాయలేక పోయాను ఇన్ని రోజులు.. ఆ మహానుభావుని ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా ఆ దేవుని కోరుకుంటూ.....

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner