30, సెప్టెంబర్ 2010, గురువారం

చరిత్ర పునరావృతం...

ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్న మాట అక్షరాల నిజమైంది నిన్నటి తీర్పుతో....చరిత్ర పునరావృతమైంది మరొక్కసారి...న్యాయదేవత పలుకుబడి, అధికారం, డబ్బులకు అమ్ముడుపోయి నిజాన్ని ఒప్పుకోలేక మూగబోయింది.
ఆయేషా కేసు తీర్పులో న్యాయం అన్యాయమైంది...అని అందరికి తెలుసు కాని ఎవరు ఏమి చేయలేరు....కళ్ళు చెవులు అన్ని వుండి కుడా ఏమి లేనివారమయ్యాము ఈ రోజు....ఆయేషా కేసు అయినా మొద్దు శీను కేసు అయినా మరోకరైనా అధికారం, ధనాశకు దాసోహమనక తప్పడం లేదు...చట్టం తనపని చేసుకుపోదు. అధికారానికి కొమ్ము కాస్తుందని మరొక్కసారి ఋజువైంది అంతే.....సత్యంబాబు కి శిక్ష వేయడం ఎంత వరకు సమంజసం?? అందరికి తెలిసిన నిజం, అబద్దపు సాక్ష్యాలు కోర్టుకి ఎందుకు తెలియలేదు? నిరపరాధికి శిక్ష పడకూడదన్న నైతిక న్యాయాన్ని ఎందుకు మర్చిపోయారు? తీర్పు చెప్పిన గౌరవనీయులైన న్యాయాధికారిగారు. పేదవాడికి అందుబాటులో లేని చట్టం ఎవరి కోసం? మేధావులు ఒక్కసారి ఆలోచించండి......న్యాయాన్ని నిలబెట్టండి......!!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner