13, జులై 2011, బుధవారం

దేవుడు-డబ్బు-మానవుడు....??

అనంత పద్మనాభుడి ఆస్థులు అనంతానంతమేమో..!! అందరిలో డబ్బులు ఎక్కువగా ఉన్న దేవుడని జనాలు.... ఇన్నాళ్ళు కొలిచిన తిరుపతి వెంకన్నను మర్చిపోతారేమో!! ఎంతయినా డబ్బులకున్న మహిమ అదే కదా మరి. ఇన్ని రోజులు గుర్తుకు రాని పద్మనాభుని ఆస్థులతో పాటుగా జగన్నాధుని సొమ్ములకు లెక్కలు చెప్పమనే ధైర్యం మన నాయకులకు వచ్చిందోచ్..!! ఆఖరుకి ఏమి తేల్చుతారో కానీ మంచి రసదాయకంలో పడింది బడా నాయకుల పని ఇప్పుడు. దేవుని సొమ్ములు దేవుని సొంతం కాని మరి అక్రమంగా సంపాదించిన సొమ్ము ఎవరికీ చెందుతున్దనేది ప్రశ్నార్ధకమే?? జగన్ ఒక్కడేనా అక్రమంగా సంపాదించింది? అందరి ఆస్థులకు లెక్కలు తేల్చాలి కదా...ఇప్పుడు వారికి ఎదురు తిరిగాడని లెక్కలు చూడాలా!! అమ్మగారికి సలాములు కొట్టే నాయకుల లెక్కల పద్దులు అక్కరలేదా!! చట్టం అందరికి సమానమైతే అందరి లెక్కలు తేల్చండి.....జనాల సొమ్ము తినేస్తున్నారు అంటున్నారు కాని జనాలని కుడా తినేస్తున్నారు ఈ నాటి మన ప్రజాస్వామ్య నాయకులు.....ఇదేనండి మన ప్రజాస్వామ్యం!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

ఆలోచించే చెప్పారు...

అమ్మ గారు చూడమనలేదు లెక్కలు మేడం..హైకోర్టు చూడమంది...

చెప్పాలంటే...... చెప్పారు...

హైకోర్టు అమ్మగారి హైయాం లోనిదే అండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner