16, మే 2014, శుక్రవారం

మంచి పని....!!

అందరు మరచిపోయిన ఒక విషయం ఈ ఎన్నికల గెలుపుఓటముల  సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది...ఆంధ్రప్రదేశ్ కి ఆఖరి ముఖ్య మంత్రిగా కిరణ్ కుమార్ గారు క్లిష్ట పరిస్థితుల్లో వచ్చి ఒక దారికి తెచ్చి ఏమి చేయలేని పరిస్థితిలో ఆఖరిలో రాజీనామా చేసినా...  పార్టి పెట్టినా....  మనం నమ్మలేని పరిస్థితులు కల్పించిన కొందరు సామాజికవాదులు రాజకీయ నాయకుల  మీద అసహ్యం కలిగేటట్లు చేశారు...  కాకపొతే కిరణ్ కుమార్ ఒక మంచిపని చేశారు అది నాకు ఒకరు చెప్తేనే తెలిసింది గుర్తు చేసిన తిలక్ గారికి ధన్యవాదాలు ఇంతకీ ఆ మంచి పని ఏమిటో మీకు అర్ధం అయ్యిందా... అదేనండి బొత్స సత్యన్నారాయణ గారిని చివరి ముఖ్య మంత్రిగా మనకు అందించకుండా చేశారు...చదువుకున్న యువత కూడా ఓ రకంగా సరిగా ఆలోచించ లేదనే అనిపిస్తోంది. ధనం మూలం మిదం జగత్ అని నిరూపించారు ఉద్యోగులు కూడా డబ్బులు తీసుకున్న ఈ రోజులు చూస్తూ మన ప్రజాస్వామ్యం ఎంత దిగజారిపోయిందో అని బాధ పడతూ ప్రజా తీర్పు కోసం నాయకులతో పాటు మనము ఎదురు చూస్తున్నాము...చూద్దాం గెలిచిన పార్టీలు నాయకులు తమ తమ మాటలను ఎంత వరకు నిలబెట్టుకుంటారో....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner