17, నవంబర్ 2019, ఆదివారం

ఇప్పుడే తెలిసింది..!!

       ఆంధ్రప్రదేశ్ ఆంగ్లప్రదేశ్ గా మారబోయే క్రమంలో అంధప్రదేశ్ గా కూడా మారిపోయింది. కొందరు పెద్దలకు కూల్చివేతలు, నిర్మాణ నిలిపివేతలు కూడా అభివృద్ధిలో భాగంగా కనబడటమే. భాషా ప్రాతిపదికతన ఏర్పడిన రాష్ట్రానికి అధిపతిగా, ఆ భాష మనుగడనే లేకుండా చేయడంలో కూడా తప్పేం లేదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేయడానికి ఇంగ్లీష్ లో రాసి తీసుకెళితే Ease చదవడం రాని, అర్థమే తెలియని సి ఐ లు ఉన్నందుకు, ప్రజల తలరాత ఇంగ్లీష్ తో మార్చేద్దామన్న ప్రయత్నం అభినందించదగ్గదే.
       మరి కొందరు ఈ తెలుగు భాష గురించి బాధ పడేవారందరూ వారి వారి పిల్లల్ని తెలుగు మాధ్యమంలో, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారా అని అడగడంలోనూ తప్పు అస్సల్లేదు..

" ఒక చిన్న ప్రశ్న..చిన్నపాటి జ్వరం వస్తే మనలో ఎంతమంది ప్రభుత్వాసుపత్రికి వెళుతున్నాం..? "

ఇంగ్లీష్ చదువు ఉద్యోగాల కోసమనంటే...అదీ పేదవారి పిల్లల కోసమని అనుకుంటే.. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే సమాధానం తెలియని ప్రభుత్వంలో ఉన్న మనకి, తిరోగమనాభివృద్ధి లో ముందున్న మనకి, ఈరోజేంటన్నదే ప్రశ్నార్ధకమైన మనకి అసలు ఏ సమస్యా లేకుండా చేస్తున్నందుకు,

అదేమని అడిగితే పేటియం బాచ్ తో ట్రోల్ చేయించడం... సాక్ష్యాలు, ఆధారాలన్నీ తీసుకుకెళితే తప్పక కేస్ ఫైల్ చేసి, ఎఫ్ ఆర్ కాపీ ఇచ్చి తర్వాత చెత్తబుట్టలో వేసిన రక్షణ అధికారులు, ఇంకేముంది మీరు ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేసి ఆ నంబర్ ఇవ్వండి...వీళ్ళను పట్టుకు వస్తామని అన్నీ చేసాక అడ్రస్ లేని సైబర్ క్రైమ్... ఇదండి పారదర్శకత...

నీతులు చెప్పవద్దు...మీరు చేయాలనుకున్నది చేస్తున్నారు... దానికి సాకులు చెప్పాల్సిన అవసరం లేదు..ఎవరేమన్నా మీ వర్గానికి మీరు న్యాయం చేసుకుంటున్నారంతే. దానికింత హడావిడి అవసరం లేదు..దిగ్విజయంగా మీ పని మీరు చేసుకోండి గౌరవంగా.. అడిగేవాడెవడు చెప్పండి..?

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner