3, ఆగస్టు 2020, సోమవారం

అగమ్యగోచరం...!!

       కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల కోరికను బాగా తీర్చారు కదా... మీకు కావాల్సింది ఇదే కదా.. 
ఎంజాయ్ చేయండి...చిలక్కి చెప్పినట్టు చెప్పినా వినని బతుకుల రాత ఇంతే.. అనుభవించండి.. అభివృద్ధి పధంలో మునుముందుకు దూసుకుపోతున్నందుకు...ప్రపంచానికే ఆదర్శ పారదర్శక పరిపాలనకు, ఓ కులాన్ని దూషిస్తూ తన మంచి మనసు చాటుకున్న, సదరు దైవస్వరూపుని అసలు నైజం అర్థం అయ్యిందా ఇప్పటికైనా...రాజకీయ పార్టీలలకతీతంగా మీ మీ పదవులకు రాజీనామాలు చేసి కనీసం మనుషులుగా మిగలండి. లేదంటారా ఈ వంచనకు ఫలితం అనుభవించక తప్పదు. ఎన్నికలు ముందోమాట...పట్టం కట్టాక నియంత పాలన... ఇదేగా అందరు తెలిసి ఓటు వేసిన పాలన. 
      అయినా పెద్దాయనా మీకున్న అనుభవం ఏమైంది? తెలిసి తెలిసి ఇలా చేసారేంటి? ఏదైనా పని ప్రారంభించేటప్పుడు తరతరాలు స్థిరంగా ఉండేటట్లు చూడాలి కాని, అధికారం మారితే రాజధానులు ఇష్టారాజ్యంగా పెంచే చట్టాలకు చెక్ పెట్టడం మీకు తెలియాలి కదా. ఈ విషయంలో తప్పు మీదే పెద్దాయనా.
      దైవసమానుల మాటకే వద్దాం అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణతో జరుగుతుందని ఎన్నికలు ముందు ఎందుకు చెప్పలేదు సామి? రాజధానులు పెరిగితే అభివృద్ధి జరుగుతుందనుకుంటే జిల్లాకో రాజధాని, లేదా మండలానికో రాజధాని చేయండి. ఎన్ని రాజధానులైతే అందరు ముఖ్యమంత్రులూ ఉండండి. ఇక కుప్పలు తెప్పలుగా కంపెనీలు మన రాష్ట్రానికే వచ్చిపడతాయి. అప్పుడు ఉద్యోగాలు చేసే మనుషులు తక్కువై పరాయి రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుందాం. ముందు జనానికి కావాల్సిన సదుపాయాలు చూడండి సార్. జనం బతికుంటే మీ అధికారం సాగుతుంది. శవాలతో పరిపాలన చేయలేదెవరూ ఇప్పటి వరకు. 151+ అనే అహంకారం కదా... చేయండి చేయండి మీకేదనిపిస్తే అదే చేయండి... గుడ్ లక్.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner