విజయనగరం దగ్గరలో పల్లెటూరు, ఆ ఊరికి రెండు మైళ్ళ దూరంలో గవర్నమెంట్ హైస్కూల్ లో టెన్త్ వరకు చదివాము. బాగా వెనుక పడిన ప్రాంతం అప్పుడు. చాలా తక్కువ మంది చదివేవాళ్ళు. రెండు ప్రైవేటు బస్సులు తిరుగుతూ ఉండేవి విజయనగరం వరకు. అన్ని మామిడి తోటలు, చెరుకు పొలాలు, వేరుసెనగ, ఇంకా చాలా తోటలు ఉండేవి మా వూరు నుంచి స్కూల్ వున్న వూరు వరకు. వేసవి లో ఒంటిపూట బడులప్పుడు బస్సు వుండేది కాదు పొద్దున్నే. నడుచుకుంటూ వాక్కాయలు, పుల్లరేగుకాయలు తింటూ, మామిడి కాయలు దొంగతనంగా కోసుకుని ఉప్పు కారం తో తింటే అబ్బాఆ రోజులే భలే ఉండేవి. తెలుగు మాస్టర్ గారు నాతోనే పాఠం చదివించే వారు, ఒక్క తప్పు అయినా చదువుతానేమో అని. టెన్త్ వరకు నేనే చదివేదాన్ని ఒక్క తప్పు లేకుండా....ఇక్కడ ముఖ్యం గా కొంత మంది గురించి చెప్పాలి. మా హింది టీచర్ గారి గురించి చెప్పాలి. మాకు పాఠాలే కాకుండా జీవితం లో జరిగే ఎన్నో విషయాలను, కధలను, కబుర్లను, చెప్పే వారు. లెక్కల మాస్టర్ గారు చాల బాగా లెక్కలు చెప్పే వారు. ఈయన అంటే అందరికి భయం. ఇక సైన్సు , సోషల్ మాములు గా చెప్పే వాళ్ళు. స్కూల్ లో చిన్న చిన్న పోట్లాటలు జరుగుతూ వుండేవి. ఇంకా వుంది.....


