సమీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సమీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, జనవరి 2026, సోమవారం

మలుపు సమీక్ష

  



           జీవితపు మదిలో మలుపుల సమ్మేళనమే మలుపు


       ప్రతి మనిషి జీవితంలోనూ ఎన్నో అనుభవాలు. అవి తీపిచేదుల కలయికలు. అనుభవాలను, అనుబంధాలను అందరు అక్షరీకరించలేరు. అనుభవాలకు అనుబంధాలను జత కూర్చి చక్కని కథలుగా మన ముందుకుమలుపుకథల సంపుటిని తీసుకువచ్చారు డాక్టర్ లక్ష్మీ రాఘవ గారు. డాక్టర్ లక్ష్మీ రాఘవ గారి కథలు చదువుతుంటే చాలా వరకు అవి మనకు జరిగిన అనుభవాలో లేక మన చుట్టూ వున్న సమాజంలో మనకు ఎదురుపడిన సంఘటనలో అని అనిపించక మానదు. సరళమైన భాషలో అందరికి సులభంగా అర్థమయ్యే తీరులో కథలన్నీ వున్నాయి


        జీవితంలో బాధల వెంట సంతోషాలు వుంటాయని తెలిపే కథమలుపు”. 

కాలం మారితేకథ ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా మనిషి ఆలోచనా విధానాన్ని తెలిపిన కథ.

టెక్నాలజీ పెరగడం మంచిదో కాదో అంటూ నిర్ణయాన్ని పాఠకులకు వదిలేసిన కథజాతకం”.

అప్పగారి పాపోడుపల్లెటూరి ఆత్మీయతను మనసుతో చూపించిన కథ.

ఓటమి నేర్పిన సత్యంతో గెలుపు ఎంత తృప్తినిస్తుందో చిన్నపిల్లలతో చెప్పించిన కథస్నేహంచాలా బావుంది.

వస్తువులతో పాటుగా మనిషి శరీరానికి అప్పుడప్పుడురిపేరుఅవసరమే.

హృద్యమైన మనసు ఆర్తి, ఆర్తనాదము కలిస్తే  “కంటి నీరుకథ.

అవసరానికిఎవరు మనవాళ్ళో తెలిపిన స్నేహితుల కథ.

మనుమరాలి ప్రేమకథలో అమ్మమ్మ మనసును తెలిపారు.

ఇల్లాలి తెలివి ఇంటికి వెలుగు అని నిరూపించిన కథకమల”.

పదిమందికి వరంగా మారిన అంతర్లీన శక్తినిశబ్దాల శాంతిలో వినవచ్చు.

రేపటి ప్రశ్నకథ మనలోని చాలామంది కథే. ఈనాటి సమాజానికి అవసరమైన కథ.

జీవితంలో ఏది జరిగినాకర్మానుసారమేఅన్న మాట నిజంగా నిజం.

గురువుల ప్రవర్తన పిల్లలతో ఎలా వుండాలనేదితల్లి ఆవేదనకథలో బాగా చెప్పారు.

మారాల్సిన దృశ్యంఅనుబంధాల బాధ్యతలను సవివరంగా చెప్పిన కథ.

నిజాయితీకి దక్కిన విలువైన గౌరవాన్నినిజాయితీ నిడివికథలో చూడవచ్చు.

ప్రాధాన్యతకథ నిజంగా ప్రాధాన్యతే అమెరికా పిల్లలకు, ఇండియా తల్లిదండ్రులకు.

ఆత్మవిశ్వాసమేఆయుధంగా మారి నలుగురిని ఆదర్శప్రాయమైన జీవితమేఆయుధంకథ.

ఇలానే మరి కొన్ని కథల సమాహారమే మలుపుకథా సంపుటి.


మానవత్వం అంటే ఏమిటో తెలియజెప్పిన కథనిబంధన”.

     చివరిగా తమ యాభై ఏళ్ల అనుబంధాన్నిజ్ఞాపకాల సంతకం”, “Journey of Life” అంటూ చిన్న కవితే అయినా మెుత్తం జీవిత సారాన్ని చెప్పేసారు

      డాక్టర్ లక్ష్మీ రాఘవ గారు తన అనుభవాలను, మన అనుభవాలను ఏర్చికూర్చి సమాజానికి అవసరమైన విషయాలను, చాలా వరకు సమస్యలకు ముగింపులను కూడా సవ్యదిశగానే చూపించారు. ప్రతి సమస్యకు సాధ్యమైనంత వరకు మంచి పరిష్కారాలను సూచించారు. మనిషి మానసిక భావోద్వేగాలను ప్రతి కథలోనూ హృద్యంగా మలిచారు. 27 కథలతో వెలువడినమలుపుకథా సంపుటి విలువైన పుస్తకం. అందరు తప్పక చదవాల్సిన పుస్తకం. ఇంత మంచి పుస్తకాన్ని అందించిన డాక్టర్ లక్ష్మీ రాఘవ గారికి హృదయపూర్వక అభినందనలు.




14, మే 2025, బుధవారం

కవిగారి అంతరంగాలు సమీక్ష



 “అంతరంగ యుద్ధం ఈ కవిగారి అంతరంగాలు”

         హాలికులు, ఆల్కహాలికులు కలిస్తేనే కవిలోని కవిత్వం జనిస్తుందని“పి.చంద్రశేఖర ఆజాద్” గారు అన్న మాటల్లో నిజం లేదని మనం అనలేం. అలాఅని అందరు కవులు, కళాకారులు ఆల్కహాలికులు కాదు. మత్తు ఏ రకంగానైనాకలగవచ్చని వీరి ఉద్దేశ్యం. అక్షరం మత్తు, మద్యం మత్తుకి ఏదో అవినాభావసంబంధముందని మనం ఊ కొట్టక తప్పదు. “కవిగారి అంతరంగాలు” అనిరాసిన పుస్తకంలో “పి.చంద్రశేఖర ఆజాద్” గారి మానసిక సం’ఘర్షణ తనఅనుభవాల సారాన్ని మెుత్తంగా కాస్త కుదించి ఈ పుస్తకంలో చెప్పినట్టుగాఅనిపించింది.

          నిజాన్ని ఒప్పుకోవడానికి చాలా గుండె ధైర్యం కావాలి. ఏడు పదులవయసులో కూడా తనకు కవిత్వ మూలాలు ఇదమిద్దంగా ఇప్పటికి తెలియదనిచెప్పడంలోనే ఆయన కవిత్వాన్ని ఎంతగా ఇష్టపడుతున్నారో మనకు అర్థంఅవుతోంది. ఏదైనా రాతను కాని, మనిషిని కాని విమర్శించడం క్షణాల్లో పని. కానిఆ విమర్శ సహేతుకమైనదా కాదా అన్నది వారి వారి నైజాలనుబట్టి వుంటుంది. వీరు “కవిగారి అంతరంగాలు” అని రాసినా ఇది అందరూ ఒప్పుకోవాల్సిననిజాయితీ రచన. దీనిలో ప్రతి వాక్యమూ ఆనాటి నుండి ఈనాటి వరకు వాస్తవచరితే.

          అక్షరం మత్తు కొందరిని దిగజారుస్తుంది, మరికొందరిని చరిత్ర పుటల్లోచిరస్థాయిగా నిలుపుతుంది. సామాజిక,ఆర్థిక అసమానతల నుండి, రాజకీయపరపతి, ఇంకా ఇతర వ్యవస్థల్లో పేరుకుపోయిన లోపాలను, వాటి ప్రభావంతోసాహిత్య లోకంలో జరుగుతున్న లొసుగుల ముసుగులను చాలావరకు ఈపుస్తకంలో ప్రస్తావించారు. సమాజంలో కులమతాల కుతంత్రాలను, అవార్డుల, రివార్డుల అభిజాత్యాలను ఎత్తి చూపించారు. సాహిత్య సంస్థలు, సమూహాలు, భజన బృందాలు వగైరా వగైరాలన్నీ మనకు తెలిసినా మనం ఒప్పుకోలేనినిజాలనన్నింటిని ఈ పుస్తకంలో చూపించారు.

      “కవిత్వంలోనే కాదు, రాజకీయాల్లోనే కాదు, జీవితంలో మనం చేసిన తప్పులగురించి, మనం సృష్టించిన సృజన గురించి మాట్లాడుకోవాలి. మరిన్ని తప్పులుచేయకుండా జాగ్రత్త పడాలి.” ఈ మాటలతోనే ఈ కవిగారి అంతరంగం మనకుసుస్పష్టంగా తెలిసిపోతోంది. ఇంత నిజాయితీగా, ధైర్యంగా జరిగినవి జరిగినట్టుగాప్రతి విషయాన్ని, ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్టుగా అక్షరాల నక్షత్రాలనుమనసు వెన్నెల్లో మనమూ చదివేటట్లుగా రాసి’పోశారు. ఎవరు ఏది ఎలాఏరుకుంటారో అది మీ ఇష్టం అని మనకే వదిలేసారు. 

         “మన సిద్ధాంతాలకంటే జీవితం శక్తివంతమైనది.

           సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతుంటుంది.” 

ఈ మాటలు కాదని అనగలమా! సిద్ధాంతమైనా, రాద్ధాంతమైనా అసలుజీవితమంటూ మనకుంటేనే కదా! ఇవన్నీ వచ్చేది. కథలు, నవలలు ఇతరరచనలు ఎక్కువగా రాసినా, తనకు ఇష్టమైన కవిత్వం తక్కువ రాసినా, ఆ కవిత్వంనుండే తాను ప్రేరణ పొందానని సగర్వంగా చెప్పుకున్నారు. తాను ఒకప్పుడుచేయలేని పనిని కూడా నిజాయితీగా ఒప్పుకుంటూ, ఈ రచన వెలువడినప్పుడుకురిసిన విమర్శల వర్షానికి కూడా వినమ్రంగానే సమాధానం చెప్తూ, “మన శత్రువుఎవరో తెలుసుకుంటే ఆ కృషి ఫలవంతమౌతుందని” సోదాహరణంగావివరించారు. ఈ పుస్తకం చదివిన తర్వాత ఈరోజుల్లో అవార్డులు రాకపోవడమేఉత్తమ రచనకు తార్కాణం అన్న నిజం మనకు అర్థం అవుతుంది.

           జీవితంలో నిజాన్ని ఒప్పుకునే ధైర్యం వున్న ప్రతి ఒక్కరూ తప్పకచదవాల్సిన పుస్తకాన్ని తెలుగు సాహిత్యానికి ధైర్యంగా అందించిన “ పి.చంద్రశేఖర్ ఆజాద్” గారికి హృదయపూర్వక అభినందనలు.

8, మే 2025, గురువారం

నువ్వు నేను గోదారి సమీక్ష


 నువ్వు నేను గోదారి..!!


       గోదారేంటోకాని కొందరు మనుష్యులనూ వదలదు. అలా కాకుండా కొన్ని మనసులను పదే పదే స్పృశిస్తూనే వుంటుంది. “అమ్మ, ఆవకాయఎప్పటికీ బోర్ కొట్టనట్టే గోదారిఅంతే స్వచ్ఛంగా, హాయిగా సాగిపోతూ వుంటుంది. కొందరికి కొన్ని కొన్ని ఇష్టాలుంటాయ్, ప్రేమలుంటాయ్, అనుభూతులుంటాయ్, అనుభవాలుంటాయ్..ఇలా కొన్ని కొన్ని తమ మనసులోనే దాగుండి, అప్పుడప్పుడు దొంగల్లా తొంగి చూస్తుంటాయి. భావాలను అక్షరాల్లో అందంగా ఒద్దికగా పొదగడం తెలిసిన కొద్దిమందిలోమాడిశెట్టి శ్రీనివాస్గారు ఒకరు. మెుదటి కవితా సంపుటిగుండెల్లో గోదారిలో తన భావుకత్వాన్ని మనకి పరిచయం చేసి ఇప్పుడునువ్వు నేను గోదారితో మరిన్ని భావాలను గోదారితో పంచుకుంటూ, మనలనూ భావాల అలలజడిలో తేలియాడమంటున్నారు

      “అమ్మంటే అమ్మేఅమ్మకు మరో ప్రత్యామ్నాయం లేదు అన్న విషయాన్ని, అమ్మ దూరమైన బాధను అక్షరాలతో పంచుకున్నారు.

బతుకుపోరులో చివరివరకు 

  తను ఓడిపోతూనే

  నిన్ను గెలిపిస్తాడునాన్న అని అమ్మానాన్నలపై తన ప్రేమను కొసమెరుపుగా చివరిలో చెప్పడం బావుంది.

       అక్షరాల గురించి ఎవరెన్ని రకాలుగా చెప్పినా తన అక్షరాల అమరత్వం గురించి చెప్పడానికి కూడా గోదారిని ఎంచుకున్నారు. విరహాన్ని, వేదనను, ప్రేమను ప్రతి కవితలోనూ హృద్యంగా, భావస్పోరకంగా చెప్పడం చాలా నచ్చింది. భావ కవిత్వం రాయడం అంత సులువేమి కాదు. అందులోనూ 163 పేజీల్లో, ప్రతి పేజీలోనూ భావుకత నింపడం అన్నది అత్యంత కష్టతరమైన పని. దానిని అలవోకగా చేసేసారుమాడిశెట్టి శ్రీనివాస్తననువ్వు నేను గోదారిభావ కవితా సంపుటిలో

         తాను కవిని కాదని భావుకుడిని మాత్రమేనని చెప్పడం ఆయన సున్నితత్వానికి, ఖచ్చితత్వానికి నిదర్శనం. చక్కని, చిక్కని భావాలతో అందమైన, మనసులను తాకే కవితలనునువ్వు నేను గోదారికవితా సంపుటిలో ప్రేమగా అందించారు. మచ్చుకు కొన్ని భావాలను ఇలా..

దేవుడెంత శాడిస్టో కదూ..

   మనుషుల్ని విడదీస్తూ

   మనసుల్ని కలపడంలో..”


ఒకరికొకరమై

  రెండు దేహాల్లోని 

  ఒకే ప్రాణమై..”


బ్రతికుంటే జంటగా..

  మరణిస్తే చితిమంటగా..”


మనసు మూగదై రోదిస్తూ

  మనిషి జ్ఞాపకమై బాధిస్తూ..”


ఎప్పుడొస్తావని కాదు

  అసలొస్తావో రావోనని..”


బ్రతుకంతా నిన్నే చూస్తూ

  బ్రతకలేక కన్నుమూస్తూ..”


నా జీవితంలో నువ్వు..

  ఉప్పెనై వచ్చిన అలవు కాదని 

  ఉసూరనిపించిన కలవని..”


అమ్మేమో గంభీర గోదారి

  తనేమో గలగలా గోదారి..” 


వానొస్తే మనిషి తడి

  నువ్వొస్తే మనసు తడి..”

ఇలాంటి అద్భుతమైన భావాలు ఎన్నో నువ్వు నేను గోదారికవితా సంపుటి నిండా వున్నాయి. భావుకతను ఇష్టపడని మనుష్యులు వుండరన్నది నిజమని మనం నమ్మాలి. ఎందుకంటే తిలక్ భావుకతను ఆస్వాదించని భావుకులు ఎవరు వుండరన్నదంత నిజం. యండమూరి వీరేంద్రనాథ్ గారివెన్నెల్లో ఆడపిల్లని గోదారి అందాలను ఇష్టపడే ప్రతి ఒక్కరికి పుస్తకం తప్పక నచ్చుతుంది. చాలా అందంగా వేదనను, విరహాన్ని, నిరీక్షణను, ప్రేమను గోదారితో పంచుకున్నమాడిశెట్టి శ్రీనివాస్గారికి హృదయపూర్వక అభినందనలు.


పుస్తకం కావాల్సిన వారు 9849494097 కి కాల్ చేయండి.

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner