7, జులై 2025, సోమవారం

అరుదైన ఆత్మీయ కలయిక..!!

 






        “మన కోసం మన ప్రపంచం” ముఖపుస్తకంలో ఇప్పుడు ఎన్నో సమూహాలు వున్నాయి. కాని ఈ “మన కోసం మన ప్రపంచం” సమూహం చాలా ప్రత్యేకమైనది. కొన్ని నెలల క్రిందట శిరీష కొసరాజు నన్ను ఈ సమూహంలో జత చేయడానికి అడిగినప్పుడు..నేను రాయడం తక్కువేనమ్మా, గ్రూపుల్లో పోస్టులు పెట్టడం లేదు అని అన్నప్పుడు, మీరు మా గ్రూపులో వుండండి చాలు, మీకు వీలున్నప్పుడల్లా చూసి స్పందించండి అన్నారు. సరేనని ఈ గ్రూపులో జాయిన్ అయ్యాను. అడపాదడపా కొందరి పోస్టులకు, పుట్టినరోజులకు నా స్పందనలు పెడుతున్నాను. 

        నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నుండి ఉగాది పురస్కారం లభించిన తర్వాత, నా మెుదటి పుస్తకం “అక్షరాల సాక్షిగా..నేను ఓడిపోలేదు” ఆవిష్కరణకు వచ్చి అప్పటి నుండి ఆత్మీయురాలుగా మారిన పద్మజ కోగంటి నుండి ఫోన్ వచ్చింది. వై వి రావు గారు మాట్లాడుతూ అభినందనలు తెలిపారు. తర్వాత ఇంటికి కూడా వచ్చి వారి ఆత్మీయ సత్కారాన్ని అందించారు. ఈ గ్రూప్ మీట్ కి రమ్మని చెప్పారు.

       నా అనారోగ్య కారణం దృష్ట్యా రావద్దని అనుకున్నా కాని మా తమ్ముడు గుడిసేవ విష్ణుప్రసాద్ మాస్టారు కొద్దిసేపు వుండి వెళిపోదురు రండి అని అంటే, ఓ గంట వుండి వెళిపోదామనుకున్నా. పెద్దలందరికో నన్నూ అతిథిగా ఆహ్వానించి, ఆత్మీయ సత్కారాన్ని అందించారు.

         పెద్దలందరు చక్కని జీవితానుభవాలను, మనం ఎలా జీవించాలన్న ఎన్నో విషయాలను చెప్పారు. తాత్వికత,చెమక్కులు, చురకలు, హాస్యపుజల్లులు ఆద్యంతమూ వెల్లివిరిసాయు. 

కొందరు సభ్యులు చేసిన అవయువ, శరీర దానాలతో మరణానంతరమూ ఎలా జీవించాలో కూడా తెలియజేసారు. వారికి హృదయపూర్వక అభినందనలు.  

              ఇంతగొప్ప కలయికలో నాకూ భాగమిచ్చినందుకు వై వి రావు గారికి, గ్రూపులోని ప్రతిఒక్కరికి మనఃపూర్వక ధన్యవాదాలు.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner