25, ఆగస్టు 2015, మంగళవారం

మరోసారి మూల్యం చెల్లించక తప్పదు...!!

తన వాళ్ళు అధికారంలో ఉండగా కనిపించని జనం సమస్యలు ఈ రోజు భలే కనిపిస్తున్నాయి కొందరు పెద్దలకు... ప్రకృతి వైపరీత్యాలకు, విష జ్వరాలకు కూడా ధర్నాలు చేస్తూ జనం కోసం తెగ దిగులు పడి పోతున్నారు... మరి కొందరేమో నేను పార్టీలకు అతీతం జనం కోసమే నా జీవితం అంటున్నారు... అబ్బా సామాన్య జనానిది ఎంత అదృష్టమో... ఇందరి అభిమాన సంద్రంలో ఊపిరి ఆడక కొట్టుకు పోతున్నారు... ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరలతో.... పదవిలో బాబులేమో మా దగ్గర డబ్బులు లేవు ఏం చేయాలన్నా అంటూనే మీకు కావాల్సిన నిధులు ఇప్పిస్తాం అంటుంటే కనీసం మాట్లాడటానికి సమయం లేదని అంటున్నారు... ఇదండీ ఇప్పటి నాయకుల నైజం.. చూసారా మనం ఎంత గొప్ప నాయకుల సంరక్షణలో ఉన్నామో.....ఆనాడు నల్లమల అడవుల్లో అమాయకులను నక్సలైట్లు అని ముద్ర వేసి విషాహారం పెట్టి చంపించినప్పుడు జనం గుర్తుకే రాలేదు... ఈనాడు ఓదార్పు యాత్రలు, జనం కోసం నా జీవితం అంటూ ఒట్టి మాటలు.... ఎప్పుడో ఒకసారి నిద్రలో కలలా జనం గుర్తుకు వచ్చి నేను ఎవరి బానిసను కాదు రైతుల పక్షమే అని నాలుగు రోజులు ట్విట్టర్ లో ట్వీటులు.... దేశాల చుట్టూ కేంద్రం చుట్టూ తిరుగుతూ కాలయాపన చేస్తూ కల్లబొల్లి కబుర్లు చెప్తూ జనం సొమ్ము వృధా చేస్తున్న వారు... ఇవండీ ఇప్పుడు జరుగుతున్న తంతులు... ఎవరికి వారికి మేము జనానికి గుర్తులో ఉండాలి అనే తప్ప జనం కోసం తపన కాదు....
సామాన్యుని నిత్యావసరాలు తీర్చలేని ఈ నాయకుల ఓదార్పులు, ధర్నాలు, పాద యాత్రలు, బొమ్మల్లో చూపించే రాజధాని ఇలాంటి సినిమాలు రేపు మళ్ళి ఎన్నికల్లో గెలవడానికి పనికిరావు ఏ ఒక్కరికి.... జనానికి కావాల్సింది వారి నిత్యావసరాలు... కనీసావసరాలు తీర్చగలిగే నాయకులు, పాలక పక్షం... నేను నా పదవి పదిలం అనుకుంటే అది పొరపాటే అవుతుంది.... దేశాలు తిరుగుతూ కాలయాపన చేస్తే మరోసారి మూల్యం చెల్లించక తప్పదు...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner