![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgPN4g2M52g02mTCb5_ZaMLYQbUcFf3DxhrymuM5fUatKkv5qGuFeMdWUiCh20smZc06zIlvrIz33zysqckb0DDlm7kEBvgLO_KDEBzvG3ZzxRHb9iHxx92-WTmtk3ik6XW6nOoGXWAS6c/s1600/sdfdsf.jpg)
మన అవసరాలు తీర్చుకోవడానికి బంధాల మధ్యన బంధనాలు వేయడం, అవాకులు చవాకులు పేలడం నిత్య కృత్యంగా మార్చుకున్న కొందరు మానసిక రోగులను చూస్తుంటే వాళ్ళ మీద కోపం రావడం కాకుండా జాలి వేస్తోంది. అంతకన్నా విచారకర విషయం ఏమిటంటే ఈ మానసిక రోగుల మాటలు విని ఎదుటివాళ్ళని సూటీపోటీ మాటలనే చదువుకున్న, చదువు చెప్పే మూర్ఖులను చూస్తుంటే చాలా బాధగా ఉంటోంది. మనకు అవసరం అనిపించింది వేరొకరికి అనవసరం అనిపించొచ్చు, అందుకని ఎదుటివారిని దుబారా మనుష్యులు అనడం ఎంత వరకు సమంజసం..?
జీవితంలో నిలబడటానికి ఆసరా ఇచ్చిన చేతిని మరచి, అవసరానికి అనుబంధాలను అడ్డుగా పెట్టుకునే నయ వంచకుల తీయని మాటలు వింటూ వాస్తవాలను ఆలోచించలేని దౌర్భాగ్యం ఎన్ని సమస్యలను తెస్తుందో, ఎన్ని ఆత్మీయతలను దూరం చేస్తుందో తెలుసుకోలేక పోవడం నిజంగా కొందరి దురదృష్టమనే చెప్పాలి. ఆపదలో అక్కరకు రాకున్నా, అదను చూసి తోడబుట్టిన వారిని నట్టేట ముంచుతున్నా తప్పుని తప్పు అని చెప్పలేని సభ్య సమాజంలోని సగటు జీవులం. ఎటు పోతున్నామో కూడా తెలియని అయోమయంలో మాటల మాయలో పడి కొట్టుకుపోతూ చివరాఖరికి బయట పడాలనుకునే సరికి కాలం మన చేతిలో లేకుండా పోతుంది. పర్యావరణాన్ని కాపాడుకుందాం, మట్టి వినాయకుళ్ళని పెడదాం అని నినాదాలు చేస్తూ మన కుటుంబాన్ని సరి చేసుకోవడం మర్చిపోతున్నాం. కాపాడుకోవాల్సింది కుటుంబ విలువలను, బంధాలను, అనుబంధాలను. ఇవి సరిగ్గా ఉంటే సమాజం తద్వారా పర్యావరణం అన్ని బావుంటాయి. ఒకప్పటి మట్టి మనుష్యులను, మంచి మనసులను మనం గుర్తు చేసుకోగలిగితే మళ్ళి మన కుటుంబ వ్యవస్థకు మంచిరోజులు వచ్చినట్లే.
అందరికి వినాయకచవితి శుభాకాంక్షలు
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
చాలా అద్భుతంగా వ్రాసారు.
Click Here To my blog kscwrites.com.
ధన్యవాదాలు అండి
కామెంట్ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి