15, జూన్ 2026, సోమవారం

విద్యార్థులకు చేయూత..14/06/2026













 *ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చేయూత..*

******🌟🌟******


ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు చేయూత అందించారు.


ఆదివారం కోడూరు శివారు      నరసింహపురం గ్రామంలో ట్రస్ట్ సభ్యులు యనమదల సుబ్బారావు ఏర్పాటు చేసిన సమావేశానికి  డాక్టర్ మంతెన నరసరాజు, ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ డాక్టర్ కృష్ణ , కోడూరు ఎస్సై చాణక్య ముఖ్య అతిథులుగా విచ్చేసి 11 మంది విద్యార్థులకు 5వేల విలువగల చెక్కులు అందజేశారు. మరో మూడు చెక్కులు కూడా అందజేసారు. ఈ 


గత 19 సంవత్సరాలుగా నిరుపేద విద్యార్థులకు "రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్" అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్, కార్యదర్శి మంజు సహకారంతో ఆర్థిక చేయుత అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు" 372 మంది విద్యార్థులకు" ఈ సహకారాన్ని అందించినట్లు తెలిపారు.


ఎస్సై చాణక్య మాట్లాడుతూ. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఇలా ప్రతి సంవత్సరం ట్రస్ట్ తరుపున తోడ్పాటు అందించడం అభినందనీయమని కొనియాడారు.


ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner