31, ఆగస్టు 2013, శనివారం

సమ న్యాయమా సమైఖ్యమా.....!!

రాజకీయ నేతల స్వార్ధంతోనే తెలంగాణా విభజన మొదలైందని ఈ పాపం కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలది అని మాజీ మంత్రి, అధికార భాషా సంఘం అద్యక్షులు మండలి బుద్దప్రసాద్ అన్నారు. వై ఎస్ జగన్ సమ న్యాయం లేదా సమైఖ్యం అంటూ గత ఏడురోజులుగా చేస్తున్న దీక్షను భగ్నం చేసారు...జగన్ దీక్షను కొనసాగిస్తారని...కె సి ఆర్ గారు కూడా ఫ్లూయిడ్స్ ఎక్కించుకుని దీక్షను చేసారని గుర్తు చేసిన జగన్ అనుచరులు. ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ గారి మాటల ఆంతర్యం అర్ధం కాక సొంత పార్టి లోనే తర్జనబర్జనలు పడుతున్నారు. అధిష్టానానికి ఎదురు చెప్పని విధేయులు  సమైఖ్యాంధ్రకు మద్దత్తుగా మాట్లాడుతుంటే పార్టీని సీమాంధ్రలో బతికించుకోవడానికా లేక కొత్త పార్టీని పెట్టబోతున్నారా అని సందిగ్ధంలో ఉన్నాయి పార్టీ శ్రేణులు. పార్లమెంట్లో వాదనలు వినిపించడానికే రాజీనామాలు చేయలేదు....వాదనలు వినిపించక పొతే బిల్లు ఆమోదం పొందుతుంది...రాష్ట్రం సమైఖ్యంగా లేక పొతే పార్టీ నుంచి తప్పుకుంటానన్న లగడపాటి. చంద్రబాబు గారి ఆత్మ గౌరవ యాత్ర....దేనికోసం..!! ఆగని సీమాంధ్ర, తెలంగాణా ఉద్యోగుల నిరసనలు....గత ముప్పై రెండురోజులుగా జరుగుతున్న దమ్ము తగ్గని సీమాంధ్రుల నిరసనల హోరు...పొరు....అదే జోరు. సమ న్యాయమా సమైఖ్యమా....!! అంటూ ఇంటా బయటా నిరసనల వలయంలోను ఎటూ తేల్చని హై కమాండ్ అమ్మగారు...!!  

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Unknown చెప్పారు...

సమైక్యం out of question ఇక సమన్యాయం!అందుకు కేంద్ర కమిటీ కి నివేదించుకోవడమే మార్గం!

చెప్పాలంటే...... చెప్పారు...

తొందరెందుకు వేచి చూడండి ప్రకాష్ గారు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner