
అసలు కవిత్వం అంటే ఏమిటి... కవిత్వం పుట్టు పూర్వోత్తరాలు, కవిత్వంలో రకాలు ఎన్ని మొదలైన విషయాల గురించి ఈ వారం కాస్త తెలుసుకుందాం.. ముందుగా కవిత్వమంటే.....
కవిత్వం
కవిత్వంలో రకాలు
- అభ్యుదయ కవిత్వం (Revolutionary poetry)
- దిగంబర కవిత్వం
- బంధ కవిత్వము
- భావ కవిత్వం (Lyrical poetry)
- కాల్పనిక కవిత్వం (Romantic poetry)
ఈ వారం సాహితీ పద్దతులలో ఎక్కువగా వాడుకలో ఉన్న వచన కవితా సాహిత్యం గురించిన వివరణలు చూద్దాం
వచన కవిత
కుందుర్తి ఆంజనేయులు వచన కవితా పితామహుడుగా ప్రసిద్దుడయ్యాడు. పద్యమే కవిత్వమని అపోహ పడేవారికి ఆధునిక కాలానికి వచనమే తగినదని నిరూపించే దశలో కుందుర్తి 1958లో ఫ్రీవర్స్ ఫ్రంట్ ను స్థాపించాడు. నగరంలోవాన కుందుర్తి రచించిన వచన కవితా కావ్యం. ఈ కావ్యాన్ని వచనకవితకు లక్షణ దీపికగా కుందుర్తి రచించాడు. వచన కవితా ఉద్యమం తెలుగు సాహిత్య లోకంలో దుమారం లేపింది. చర్చలు, వాదోపవాదాలు, తిరస్కారాలు వంటి వాటితో తెలుగు సాహిత్య లోకం హోరెత్తింది. వచనం లో రాస్తే అది కవిత్వమెట్లా అవుతుందని వచన కవులను ప్రశ్నించిన వాళ్ళున్నారు.
వచన కవితా లక్షణాలు:
- శ్రీ శ్రీ అన్నట్లు చందో బందోబస్తులన్నీ వచన కవిత తెంచింది.
- వచన కవితలో గేయ కవిత లాగా మాత్ర చందస్సు కూడా నిబద్దం కాదు.
- కాలం మారిన దశలో పాత కవి సంప్రదాయలను, అలంకారాలను వచన కవిత తిరస్కరించింది.
- సామాజిక చైతన్యాన్ని రగిలించే కవితా వస్తు నిర్మాణం వచన కవితకు ప్రత్యేకం.
- కవి భావుకతకు, భావప్రకటనా స్వేచ్చకు చందస్సు ఆటంకం కాబట్టి చందోరహితమైన వచనం సామాన్యుడికికూడా అందుబాటులో ఉంటుందన్నది వచన కవుల అభిప్రాయం.
- చందో విముఖతను ప్రాణంగా కలిగిన వచన కవిత, భావుకతకు ప్రాధాన్యత నిచ్చింది.
- ఆకర్షణీయమైన అంత్య ప్రాసలు వచన కవితకు అలంకారాలయ్యాయి.
- చమత్కారమైన అధిక్షేపణ వచన కవుల సొత్తు.
వచన కవితకు శిష్ట్లా , పఠాభి, నారాయణ బాబు, శ్రీశ్రీ వంటి వారు అద్యులు కాగా , కుందుర్తి వచన కవితా ఉద్యమాన్ని నిర్వహించి వచన కవితా పితామహుడు అని పేరు తెచ్చుకున్నాడు. వచన కవితలో భావప్రకటనకు ప్రత్యేకత ఉంది.
తాటి ఆకుల్తో కప్పుకుంటుంది"
వచనకవిత చందో ప్రాధాన్యం లేనిది కాబట్టి అనవసర పదాలు, పదాడంబరం పట్ల ప్రత్యేక శ్రద్దా ఉండవు. జనజీవితంలోని అలంకారాలకు ప్రాధాన్యతనివ్వడం వచన కవుల ప్రత్యేకత. ఆధునిక కవుల్లో అద్భుతమైన వచనకవితలు రాస్తున్నవారిలో కె. శివారెడ్డి, నందినీ సిధారెడ్డి, ప్రేంచంద్, అఫ్సర్ వంటి కవులు వచన కవితా ప్రక్రియకు వన్నెలు తెస్తున్నవారు. ఇప్పుడు పద్యం రాసే వారికంటే వచన కవిత రాయడం వైపే మొగ్గు చూపేవారు ఎక్కువ. ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రతి సంవత్సరం ఒక ఉత్తమ వచన కావ్యానికి పురస్కారాన్ని ప్రకటించి వచన కవితా ప్రక్రియను పరిపుష్టం చేస్తోంది.
ఈనాడు వచన కవిత్వం ఎన్నో కొత్త పుంతలను తొక్కింది అనడంలో అతిశయోక్తి ఏమి లేదు... ఎంతో మంది కవులు తమ భావాలను వచనంలో సున్నితంగా, హృద్యంగా, మనసులకు హత్తుకునేటట్లు చెప్పడంలో చేయి తిరిగిన కవులయ్యారు. ఎన్నో పురస్కారాల సత్కారాలను అందుకుంటున్నారు....
ఇలా చెప్పుకుంటు పోతుంటే అంతు లేని మహా సాగరం ఈ సాహితీ సంద్రం... ఇక ఈ వారానికి ముగిస్తూ వచ్చే వారం మరి కొన్ని సాహితీ ముచ్చట్లతో మళ్ళి కలుద్దాం....
సేకరణ : వికీపీడియా నుండి
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి