“అంతరంగ యుద్ధం ఈ కవిగారి అంతరంగాలు”
హాలికులు, ఆల్కహాలికులు కలిస్తేనే కవిలోని కవిత్వం జనిస్తుందని“పి.చంద్రశేఖర ఆజాద్” గారు అన్న మాటల్లో నిజం లేదని మనం అనలేం. అలాఅని అందరు కవులు, కళాకారులు ఆల్కహాలికులు కాదు. మత్తు ఏ రకంగానైనాకలగవచ్చని వీరి ఉద్దేశ్యం. అక్షరం మత్తు, మద్యం మత్తుకి ఏదో అవినాభావసంబంధముందని మనం ఊ కొట్టక తప్పదు. “కవిగారి అంతరంగాలు” అనిరాసిన పుస్తకంలో “పి.చంద్రశేఖర ఆజాద్” గారి మానసిక సం’ఘర్షణ తనఅనుభవాల సారాన్ని మెుత్తంగా కాస్త కుదించి ఈ పుస్తకంలో చెప్పినట్టుగాఅనిపించింది.
నిజాన్ని ఒప్పుకోవడానికి చాలా గుండె ధైర్యం కావాలి. ఏడు పదులవయసులో కూడా తనకు కవిత్వ మూలాలు ఇదమిద్దంగా ఇప్పటికి తెలియదనిచెప్పడంలోనే ఆయన కవిత్వాన్ని ఎంతగా ఇష్టపడుతున్నారో మనకు అర్థంఅవుతోంది. ఏదైనా రాతను కాని, మనిషిని కాని విమర్శించడం క్షణాల్లో పని. కానిఆ విమర్శ సహేతుకమైనదా కాదా అన్నది వారి వారి నైజాలనుబట్టి వుంటుంది. వీరు “కవిగారి అంతరంగాలు” అని రాసినా ఇది అందరూ ఒప్పుకోవాల్సిననిజాయితీ రచన. దీనిలో ప్రతి వాక్యమూ ఆనాటి నుండి ఈనాటి వరకు వాస్తవచరితే.
అక్షరం మత్తు కొందరిని దిగజారుస్తుంది, మరికొందరిని చరిత్ర పుటల్లోచిరస్థాయిగా నిలుపుతుంది. సామాజిక,ఆర్థిక అసమానతల నుండి, రాజకీయపరపతి, ఇంకా ఇతర వ్యవస్థల్లో పేరుకుపోయిన లోపాలను, వాటి ప్రభావంతోసాహిత్య లోకంలో జరుగుతున్న లొసుగుల ముసుగులను చాలావరకు ఈపుస్తకంలో ప్రస్తావించారు. సమాజంలో కులమతాల కుతంత్రాలను, అవార్డుల, రివార్డుల అభిజాత్యాలను ఎత్తి చూపించారు. సాహిత్య సంస్థలు, సమూహాలు, భజన బృందాలు వగైరా వగైరాలన్నీ మనకు తెలిసినా మనం ఒప్పుకోలేనినిజాలనన్నింటిని ఈ పుస్తకంలో చూపించారు.
“కవిత్వంలోనే కాదు, రాజకీయాల్లోనే కాదు, జీవితంలో మనం చేసిన తప్పులగురించి, మనం సృష్టించిన సృజన గురించి మాట్లాడుకోవాలి. మరిన్ని తప్పులుచేయకుండా జాగ్రత్త పడాలి.” ఈ మాటలతోనే ఈ కవిగారి అంతరంగం మనకుసుస్పష్టంగా తెలిసిపోతోంది. ఇంత నిజాయితీగా, ధైర్యంగా జరిగినవి జరిగినట్టుగాప్రతి విషయాన్ని, ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్టుగా అక్షరాల నక్షత్రాలనుమనసు వెన్నెల్లో మనమూ చదివేటట్లుగా రాసి’పోశారు. ఎవరు ఏది ఎలాఏరుకుంటారో అది మీ ఇష్టం అని మనకే వదిలేసారు.
“మన సిద్ధాంతాలకంటే జీవితం శక్తివంతమైనది.
సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతుంటుంది.”
ఈ మాటలు కాదని అనగలమా! సిద్ధాంతమైనా, రాద్ధాంతమైనా అసలుజీవితమంటూ మనకుంటేనే కదా! ఇవన్నీ వచ్చేది. కథలు, నవలలు ఇతరరచనలు ఎక్కువగా రాసినా, తనకు ఇష్టమైన కవిత్వం తక్కువ రాసినా, ఆ కవిత్వంనుండే తాను ప్రేరణ పొందానని సగర్వంగా చెప్పుకున్నారు. తాను ఒకప్పుడుచేయలేని పనిని కూడా నిజాయితీగా ఒప్పుకుంటూ, ఈ రచన వెలువడినప్పుడుకురిసిన విమర్శల వర్షానికి కూడా వినమ్రంగానే సమాధానం చెప్తూ, “మన శత్రువుఎవరో తెలుసుకుంటే ఆ కృషి ఫలవంతమౌతుందని” సోదాహరణంగావివరించారు. ఈ పుస్తకం చదివిన తర్వాత ఈరోజుల్లో అవార్డులు రాకపోవడమేఉత్తమ రచనకు తార్కాణం అన్న నిజం మనకు అర్థం అవుతుంది.
జీవితంలో నిజాన్ని ఒప్పుకునే ధైర్యం వున్న ప్రతి ఒక్కరూ తప్పకచదవాల్సిన పుస్తకాన్ని తెలుగు సాహిత్యానికి ధైర్యంగా అందించిన “ పి.చంద్రశేఖర్ ఆజాద్” గారికి హృదయపూర్వక అభినందనలు.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి